1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Tirupati laddu is 308 years old- an offering that never changes its taste and smell

తిరుమల లడ్డూకు 308 సంవత్సరాలు.. ఆ రుచి, ఆ వాసన అబ్బబ్బా..!

tirupati laddu
కలియుగ వైకుంఠం శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. 
 
ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామి వారి ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి సరిగ్గా నేటికి 308 ఏళ్లు పూర్తి అయ్యింది. మొదట 1715 ఆగస్టు 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు.
 
తిరుమల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. శ్రీవారి ప్రసాదాలలో  లడ్డూ అగ్రస్థానంలో నిలిచింది. 
 
రోజుకు లక్షలాది లడ్డూలను టీటీడీ తయారు చేస్తుంది. ఇక లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషం. 2014లో లడ్డూకు భౌగోళిక గుర్తింపు గుర్తింపు లభించింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
శ్రీకాళహస్తి: కళ్లు తెరిచిన శివయ్య.. శివలింగం నుంచి..?