1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. vote for note case..ed issue a notice to revanth reddy

ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డికి నోటీసులు

vote for note case
ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టు సమన్లు జారీ అయ్యాయి. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈడీ కేసులు విచారణ జరిపే నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు సమన్లు జారీ చేసింది. 
 
ఇందులో భాగంగా అక్టోబర్‌ 4న విచారణకు రావాలని నోటీసలో  పేర్కొంది. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు రేవంత్‌తో పాటు తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు పంపింది. 
 
వీరితో పాటు కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ, మత్తయ్య జెరుసలేం, వేం కృష్ణ కీర్తన్‌లు ఉన్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
యడ్డీ రాష్ట్ర పర్యటన వద్దు బాబోయ్.. గవర్నర్‌ పదవి ఇచ్చేయండి