సంబంధిత వార్తలు
- ఆయన 'అనంత చంద్రుడు'... జిల్లా నుంచి ఢిల్లీ వరకూ ప్రశంసలందుకున్న గంధం చంద్రుడు ఐఏఎస్
- నడిరోడ్డుపై పెద్దపులి.. చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకున్న యువకులు
- ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,916 కరోనా కేసులు.. 13 మంది మృతి
- చిరుత దాడి.. బహిర్భూమికి వెళ్లిన ఏడేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?
- హైదరాబాద్ నగరంలో చిరుత చక్కర్లు... బోనులో బంధించిన అధికారులు
అనంతపురం జిల్లాలో చిరుత సంచారం...
అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కాలనీ శివారులో చిరుత సంచరించడంతో ఆ గ్రామస్తులంతా భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామం ఎస్సీ కాలనీలో చిరుత సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎస్సీ కాలనీ శివార్లలో వచ్చి కొండ పక్కనే పొదల్లో దాగి ఉందని గ్రామానికి చెందిన కొంతమంది యువకులు చెబుతున్నారు.
చిరుత నుంచి తమకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. చిరుతను గ్రామంలోని పలువురు ప్రత్యక్షంగా చూడడంతో పాల వెంకటాపురం గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తర్వాతి కథనం
