1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:10 IST)

ఏపీ సర్కారు కీలక నిర్ణయం : త్వరలో అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
మొత్తం వారం రోజులు లేదా 5 పనిదినాలు ఈ సమావేశాలు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి డిసెంబరులో మరోసారి అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
ఈ నెలలోనే ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే ఈ నెలలో ఐదు రోజులు.. డిసెంబర్​లో మరో ఐదు లేదా వారం రోజులు నిర్వహిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఇంకా తుదినిర్ణయానికి రావాల్సి ఉంది.