బ్రహ్మపుత్ర నదిలో మునిగిపోయిన ఏపీ ఇంజనీరింగ్ విద్యార్థిని
Andhra Student
ఈ నేపథ్యంలో సాయి చేతన తన స్నేహితుల బృందంతో కలిసి శనివారం బ్రహ్మపుత్ర నదీ తీరానికి వెళ్లారు. ఆమె, మరో విద్యార్థిని నదికి దగ్గరగా వెళ్లినప్పుడు కాలు జారి, నదిలోని ప్రవాహానికి కొట్టుకుపోయారు. స్థానికులు ఆ విద్యార్థులలో ఒకరిని కాపాడగలిగారు. కానీ సాయి చేతన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అనంతరం సహాయక బృందాలు ఆమె మృతదేహాన్ని వెలికితీశాయి. లథియా బగిచా ఘాట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఐఐటీ గౌహతి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "శనివారం నాడు లథియా బగిచా ఘాట్ సమీపంలో నీట మునిగి మరణించిన ఈసీఈ విభాగం బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థిని అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. మరణించిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు మరియు ఆప్తులకు ఐఐటీ గౌహతి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
