సంబంధిత వార్తలు
- పిల్లల్ని కనండి.. మూడో బిడ్డకు రూ. 30,000, నాలుగో బిడ్డకు రూ. 40,000 ఇస్తాం: చంద్రబాబు
- రాయలసీమను రతనాలసీమగా చేస్తాం : సీఎం చంద్రబాబు నాయుడు
- తరుముకొస్తున్న సంక్షోభం - వర్క్ ఫ్రమ్ హోంపై సీఎం బాబు దృష్టి
- కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్తో సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు
- శస్త్రచికిత్స అనంతరం అమరావతికి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్
భవిష్యత్కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు
దేశాల భవిష్యత్కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ కీలకంకానుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏప్రిల్ 14న 'క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్' ప్రారంభోత్సవం తర్వాత.. ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు.
దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటం వ్యాలీ ఆవిష్కరణలు, పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. భారత ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ విభాగానికి చెందిన సీడాట్, అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుందని చెప్పారు.
ఇది పరిశోధనలకు, పరీక్షలకు తోడ్పడుతుందన్నారు. ఈ చొరవ డిజిటల్ సౌకర్యాలకు మనమిచ్చే నిబద్ధతను బలోపేతం చేస్తుందని, అమరావతిని డీప్-టెక్ ఆవిష్కరణల హబ్గా నిలుపుతుందని తెలిపారు. ఏపీ విద్యార్థులు భాగస్వాములు కావడానికి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు.
