శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (10:20 IST)

సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ నో పర్మిషన్

ys jagan
సీఎం వైఎస్ జగన్‌ మరోమారు విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ తాజా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్‌కు సీబీఐ షాక్‌ ఇచ్చింది. విదేశీ పర్యటనకు పర్మిషన్ నో చెప్పింది. 
 
మరోవైపు ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 22న సీఎం జగన్ అధ్యక్షతన జరగాల్సిన మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 24కి వాయిదా వేసినట్టు సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు.