సంబంధిత వార్తలు
- ఏపీ మంత్రి పేర్ని నానికి వర్మ ప్రశ్నలు.. అలా చేస్తే మీకు ఓట్లు.. మాకు నోట్లు!
- హస్తినలో సీఎం జగన్ బిజీబిజీ... కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
- టికెట్ రేట్లు తగ్గిస్తే హీరోకి ఏమీ కాదు.. జగన్ గవర్నమెంట్ ఈ ఇష్యూని?
- కొత్త సంవత్సరం, ఏపీలో పిచ్చ తాగుడు తాగారట, రూ. 124 కోట్ల మద్యం అమ్మకాలు
- ఏపీలో 122 మందికి కరోనా పాజిటివ్ - ఒమిక్రాన్ కేసులు నిల్
ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు 6,970
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఇందుకోసం 6,970 బస్సులను సిద్ధం చేసింది. గత యేడాదితో పోల్చితే ఈ బస్సుల సంఖ్య 35 శాతం అధికం. ఈ సంక్రాంతి బస్సుల్లో పండుగకు ముందు 4,125 బస్సులు, పండగ తరవ్తా 2,825 బస్సులను నడుపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ బస్సుల్లో ప్రత్యేక ప్రయాణ చార్జీలు వసూలు చేస్తారా లేదా అన్నది తేలాల్సివుంది.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతున్న విషయం తెల్సిందే. ఈ బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణాలోని పలు కీలక ప్రాంతాలకు నడిపేలా ఆ సంస్థ ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. అలాగే, ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయకుండానే నడుపుతామని ప్రకటించారు.
