1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 3 జనవరి 2022 (18:45 IST)

కొత్త సంవత్సరం, ఏపీలో పిచ్చ తాగుడు తాగారట, రూ. 124 కోట్ల మద్యం అమ్మకాలు

ఏపీలో మందుబాబులు రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే ఆదాయన్ని సమకూర్చారట. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను ఎంజాయ్ చేసే క్రమంలో కేసుల మీద కేసుల మద్యాన్ని కొనుగోలు  చేశారు. సాధారణ రోజుల్లో 10 కోట్ల అమ్మకాలు ఉంటే కొత్త సంవత్సరం రోజు 50 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేశారట.

 
నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ సంధర్భంగా ఎపిలో మద్యం విక్రయాలు ఊహించనివిధంగా పెరిగాయట. నిన్న ఒక్కరోజే ఎపిలో 124.10 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగాయట. 1.36లక్షల ఐఎంఎల్ లిక్కర్ కేసులు సేల్ కాగా 53 వేలకు పైగా బీర్ కేసులు అమ్ముడుపోయాయి.

 
రోజువారీగా మద్యం విక్రయాల లెక్కలు చూస్తే ప్రతిరోజు 70 నుంచి 75 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగేవి. సాధారణ రోజుల్లో 70 కోట్ల అమ్మకాలు  జరిగేవట. అయితే నిన్న రోజే అదనంగా 50 కోట్ల రూపాయల మద్యాన్ని కొనుగోలు చేశారు.

 
కొత్త సంవత్సరం వేడుకలకు లిక్కర్ సేల్స్ అధికంగా ఉంటాయని ముందుగానే అంచనా వేసింది ఎక్సైజ్ శాఖ. మద్యం దుకాణాలకు ముందుగానే ఎక్కువగానే సరఫరా చేసింది. డిసెంబర్ 30వ తేదీన 130 కోట్ల రూపాయల మద్యాన్ని దుకాణాలకు చేర్చింది.

 
ప్రీమియం బ్రాండ్లను మందుబాబులకు అందుబాటులో తీసుకొచ్చింది. 30, 31 తేదీల్లో మొత్తంగా సుమారు 215 కోట్లు రూపాయల మద్యాన్ని దుకాణాలకు సరఫరా చేస్తే ఒక్క చుక్క లేకుండా తాగేశారనేది ఆబ్కారీ లెక్కలను బట్టి తెలుస్తోంది.

 
30న 90 కోట్ల మద్యం విక్రయాలు జరిగి ఉంటాయని ప్రభుత్వం లెక్క. ఎపిలో పాపులర్ ప్రీమియం బ్రాండ్లకు కొరత ఏర్పడింది. చాలా చోట్ల ప్రీమియంబ్రాండ్లు లభించక మందు బాబులు మద్యం దుకాణాల నుంచి వెనుతిరిగిన పరిస్థితి. వివిధ పాపులర్ బ్రాండ్ల కంపెనీలు డిస్టలరీలతో ఎక్సైజ్ శాఖ సంప్రదింపులు జరిపి ఆర్డర్లు పెట్టినా సదరు కంపెనీలు పెట్టిన ఆర్డర్లకు సరఫరా చేయలేకపోయారట. దీంతో వచ్చిన స్టాకు మొత్తం త్వరగా ఖాళీ అయిపోయిందట. దీంతో ఎపిలో పాపులర్ బ్రాండ్లకు కొరత ఏర్పడిందట.