1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (11:05 IST)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్-ఏపీఎస్ఎస్‌డీసీ నుంచి జాబ్ మేళా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) నుంచి  జాబ్ మేళాకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 26 నిర్వహించనున్న ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ కియా మోటార్స్, Bharat Fih, TATA PLAYతో పాటు మరో రెండు సంస్థల్లో 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
 
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు మంగళకర డిగ్రీ కాలేజ్, గోరంట్ల రోడ్డు, పుట్టపర్తి, అనంతపూర్ అనే చిరునామాలో నిర్వహించే ఇంటర్వ్యూలలో హాజరు కావాల్సి వుంటుంది. 
 
ఇకపోతే.. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులు సులభంగా ఉద్యోగాలు కొట్టేయవచ్చు. కియా మోటర్స్.. నీమ్ ట్రైనీ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.  అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలి.
 
Bharath FIH Limitedలో అసెంబ్లింగ్ మొబైల్ ఫోన్స్  విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్/బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 
 
Tata Play: ప్రమోటర్స్ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.