శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (09:51 IST)

నేడు అమ్మఒడి మూడో విడత నిధుల విడుదల

ysjagan
శ్రీకాకుళంలో అమ్మఒడి పథకం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం వేదికగా జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ఈ నిధులను విడుదల చేస్తారు. ఆ తర్వాత లబ్దిదారులను ఉద్దశించి ఆయన ప్రసంగిస్తారు. 
 
ఇందుకోసం సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు శ్రీకాకుళంకి చేరుకుంటారు. 11 గంటల సమయంలో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందులో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు అమ్మఒడితో లబ్ది చేకూరుస్తూ రూ.43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6595 కోట్లను ముఖ్యమంత్రి స్వయంగా బటన్ నొక్కి జమ చేస్తారు. ఆ తర్వాత ఆయన అమ్మఒడి లబ్దిదారులతో ముఖాముఖిగా మాట్లాడుతారు. పిమ్మట 12.15 గంటలకు తిరిగి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.