గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (10:47 IST)

దిగ్విజయ్ సింగ్ మూలంగానే పార్టీని వీడా, తప్పు చేశా: డి.శ్రీనివాస్

తెరాస రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం అనుబంధం వున్న కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పిదం చేసినట్టు చెప్పుకొచ్చారు. దిగ్విజయ్ సింగ్ తనపై పార్టీ అధినేత్రి సోనియాకు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్లే మనస్తాపంతో ఆ పార్టీని వీడినట్టు చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తండ్రి కెసిఆర్, కొడుకు కేటీఆర్, కూతురు కవిత పడితే బంగారు తెలంగాణ అయినట్లా? అని విమర్శించారు. నా తల్లి చనిపోతే కనీసం ఒక్క మంత్రి ఎం.ఎల్ కూడా పరామర్శకు రాలేదని వాపోయారు.
 
మంత్రి ప్రశాంత్ రెడ్డి తల తిక్క మాటలు మానుకోవాలి. ఆయన నాపై చేసిన విమర్శలు ఖండిస్తున్నానని నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే నన్ను ఇప్పటికైనా సస్పెండ్ చేయండి అని సవాల్ విసిరారు. కొంత మంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా నా సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలి అన్నారు.