శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన 101 బంగారు తామరపువ్వులు
Gold Lotus
తిరుపతి శ్రీవారి ఆలయంలో ప్రతి మంగళవారం జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవ కోసం ప్రముఖ స్వర్ణకారుడు రూ.2 కోట్ల విలువైన 108 బంగారు తామరపువ్వులను ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఈ క్రమంలో బుధవారం కడపకు చెందిన దాత జ్యువెలరీ కంపెనీ అధినేతతో కలిసి వీఐపీ దర్శనంలో స్వామిని దర్శించుకుని ఈ బంగారు తామరపువ్వులను సమర్పించారు.
ఆపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాథ మండపంలో స్వామివారి పాదాల చెంత బంగారు తామరపూలను ఉంచి అర్చకులు ఆశీర్వదించి దేవస్థానం అధికారులకు సమర్పించారు.
తర్వాతి కథనం
