1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జులై 2020 (07:32 IST)

ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరదనీరు

కృష్ణా నదిపై నిర్మితమైన ప్రకాశం ‌బ్యారేజ్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజ్‌కి చెందిన 15 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి.. 14 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు.

మున్నేరు, వైరా, కట్లేరు, కీసర నుంచి భారీగా ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు చేరుకుంటోంది.సుమారు 30 వేల క్యూసెక్కుల నీరు చేరుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నది పరివాహ ప్రాంత పరిధిలోని ఎమ్మార్వోలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు పరివాహ ప్రాంత పరిధిలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.