1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Kurnool : Grade 2 VRO Suicide due to work pressure in kurnool

పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య .. ఎక్కడ?

suicide
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని ఒత్తిడితో గ్రేడ్-2 కేడర్‌కు చెందిన వీఆర్వో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని ఒత్తిడితో పాటు పై అధికారుల వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
 
కర్నూలు పట్టణంలో రెవెన్యూ అధికారిగా షేక్ మహ్మద్ హుస్సేన్ (49) నగరంలోని 30వ సచివాలయంలో గ్రేడ్-2 కేటగిరీలో పనిచేస్తున్నారు. ఆయన శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉన్నతాధికారుల నుంచి విపరీతమైన పని ఒత్తిడి పెరగడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పైగా, రెవెన్యూ సిబ్బందితో కలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 
 
దీంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులపై పనిభారం పెరిగిపోతోందని, ఈ సమస్యలను పరిష్కరించడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీఆర్వో ఆత్మహత్యకు దారితీసి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రాజౌరీ జిల్లాలో ఆపరేషన్ షెరువాలి : లోయలో పడి లెఫ్టినెంట్ దుర్మరణం