కర్నూలు జిల్లా ఆదోనీలో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు బండతాయితో మోది ఓ యువ డాక్డరుని చంపేశారు. బండరాళ్ల దెబ్బలకు తాళలేక నడిరోడ్డుపై రక్తపు మడుగులో ప్రాణాలు వదిలేశాడు. కొత్త ఏడాదికి నూతనోత్సాహంతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ప్రజలు, ఆటవిక సమాజపు ఆచారాలు ఇంకా కొనసాగడం చూసి నిశ్చేష్టులయ్యారు. విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆ యువకుడిని, కాపు కాచిన కొందరు దుండగులు బైక్పై వెంటాడి...