1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Man killed wife in Nellore

కరోనా సోకిందని కట్టుకున్న భార్యను నరికేశాడు..

Nellore
కరోనా మహమ్మారి అయినవాళ్లను, కానీవాళ్లను అందర్నీ దూరం చేస్తోంది. కరోనా సోకిందని కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలోని కావలిలో వెలుగు చూసింది. కావలికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్యకు కరోనా సోకిందని.. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. 
 
కత్తితో రెండు చేతులను నరికేశాడు. అనంతరం పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఊపిరితిత్తులే టార్గెట్‌గా కరోనా వైరస్ దాడి.. హెచ్చరిస్తున్న వైద్యులు...