1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. No enrolment in Muchhimpal school

గోడలకు, బల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్లు... ఎక్కడ?

సాధారణంగా పిల్లలకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు ఉంటారు. కానీ, ఆ పాఠశాలలో మాత్రం అందుకు విరుద్ధం. స్కూల్‌లో ఉండే 9 మంది ఉపాధ్యాయులు తరగతి గదులకు, బల్లలకు పాఠాలు చెబుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నల్

Warangal
సాధారణంగా పిల్లలకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు ఉంటారు. కానీ, ఆ పాఠశాలలో మాత్రం అందుకు విరుద్ధం. స్కూల్‌లో ఉండే 9 మంది ఉపాధ్యాయులు తరగతి గదులకు, బల్లలకు పాఠాలు చెబుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామంలో ఇలా జరుగుతోంది. 
 
ఈ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఉండగా, ఇక్కడ మొత్తం 10 తరగతులు ఉన్నాయి. మొత్తం 9 మంది ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు ఉన్నారు. అయితే, ఒక్కరంటే ఒక్క విద్యార్థి లేడు. 2002కు ముందు ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న స్కూల్‌ను ఆపై అప్ గ్రేడ్ చేశారు. 
 
గత సంవత్సరం 6 నుంచి 10వ తరగతి వరకూ ఒక్కో తరగతిలో ఒక్కో విద్యార్థి మాత్రమే ఉండగా, ఈ సంవత్సరం స్కూళ్లు తెరవగానే నలుగురు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. పదో తరగతిలో మిగిలిన ఒకే ఒక్క బాలిక కూడ గత నెలలో వెళ్ళిపోయింది. దీంతో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, మరో 8 మంది రోజూ స్కూలుకు వచ్చి సాయంత్రం వరకూ ఖాళీగా ఉండి వెళ్లిపోతున్నారు. 
 
ఈ గ్రామంలో హైస్కూలు విద్య చదివే విద్యార్థుల సంఖ్య 18 మంది కాగా, వారంతా ప్రైవేట్ స్కూళ్లకే వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్కూల్ తెలుగు మీడియంలో ఉండటంతోనే ఎవరూ చేరడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ స్కూల్‌ను మూసేసి, ఉపాధ్యాయులను మరెక్కడికైనా బదిలీ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అలాంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయాలి: తెలంగాణ మంత్రి కేటీఆర్