1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan is determined to protest the attacks on temples

ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం: పవన్ సంకల్పం

Pawan
దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు శుక్రవారం సాయంత్రం 5గంటల 30నిమిషాలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శ్రీకారం చుట్టారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ స‌మీపంలోని శంక‌రాప‌ల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో శుక్ర‌వారం సాయంత్రం దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు.

ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని పవన్ ఆకాంక్షించారు. ‘‘సాయంత్రం 5.30-6.30 మధ్య సంధ్యా సమయంలో మత సామరస్యం కోసం, ధర్మపరిరక్షణ కోసం దీపాలు వెలిగించండి.

సమస్యను, అన్యాయాన్ని అర్థం చేసుకోగల శక్తి మహిళలకు ఉంది. అందుకే ధర్మ పరిరక్షణకు, మత సామరస్యాన్ని కాపాడేందుకు మహిళలు మందుకు రావాలి’’ అని పవన్‌ విజ్ఞప్తి చేశారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
హిందువుల మనోభావాలను రెచ్చ గొట్టి లబ్ధి: బీజేపీ, జనసేనలపై మండిపడ్డ మల్లాది విష్ణు