శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్
Last Updated : మంగళవారం, 28 మే 2019 (12:18 IST)

మహిళలు పేకాట ఆడుతూ కనిపించారు.. పోలీసులు ఏం చేశారంటే?

విశాఖ జిల్లా అరిలోవలో పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసారు. దాడి చేసిన పోలీసులకు కొంతమంది మహిళలు పేకాడుతూ కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై వారిపై కేసు పెట్టి వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టేశారు. 
 
ఈ సందర్భంగా ఆ మహిళల సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలించగా అనేక విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. పేకాట కేసులో పట్టుబడిన మహిళల్లో కొందరు గంజాయి రవాణా, వ్యభిచారం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
 
దీనిపై పోలీసులు ఇప్పటికే తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా దీని గురించి రహస్యంగా మరింత లోతైన విచారణ జరపాలని సీఐని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామకృష్ణాపురంలో పేకాటడుతున్న కొంతమంది మహిళలను ఆరిలోవ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదుచేశారు. 
 
అయితే మహిళలకు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గుట్టుగా దీనికి సంబంధించిన తీగను లాగుతున్నట్టు తెలిసింది. దీనిపై సీఐ అశోక్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదంటూ సమాధానం దాటవేసారు.