1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (09:15 IST)

రేణిగుంటలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం

చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆర్పీఎఫ్‌ బ్యారక్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈయన రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యారక్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు కలకలం రేపుతోంది. 
 
కాగా, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాగా పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.