1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 5 ఆగస్టు 2021 (12:09 IST)

కొత్త బ‌ట్ట‌లు కొనివ్వ‌లేద‌ని ఆ బాలిక...

ఈ స్పీడ్ యుగంలో, ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మైనర్ లు తల్లిదండ్రులపై అలిగి, తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదనో..లేక కొత్త ఫోన్ కొనివ్వలేదనో లేక కొత్త బట్టలు కొనివ్వలేదనో ఇలా చిన్న చిన్న కార్యక్రమాలకు అలిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని అప్పపల్లి గ్రామంలో ఒకటి చోటు చేసుకుంది. 
 
తమ తల్లిదండ్రులు కొత్త బట్టలు కొనివ్వలేదని 15ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. అసిఫాబాద్ మండలం అప్పపల్లి  గ్రామానికి చెందిన శిరీష 15 ఏళ్ల పదవ తరగతి చదువుతున్న‌ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కోత్త బట్టలు కొనివ్వు అని అమ్మని శిరీష బాలిక అడిగింది. తల్లి లేదు బిడ్డ, ఈ రోజు వద్దు ...రేపు తీసుకుందాం అని చెప్పడంతో  శిరీష,  లేదు.... ఈ రో
జే కావాలి అని పట్టుపట్టింది.

తమ వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. కొత్త బట్టలు కొనివ్వలేదని మనస్థాపానికి గురైన బాలిక అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.