1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. sajjala ramakrishna reddy says ys jagan has clear plan for next term

మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో జగన్‌కు ఓ క్లారిటీ ఉంది... సజ్జల

sajjala ramakrishna reddy
వైకాపా మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓ క్లారిటీ ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జరిగిన జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 
 
జగన్ తన ఐదేళ్ల పాలనలో ఎంతో మేలు చేయాలో అంత చేశారని మళ్లీ అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఆయనకు ఓ క్లారిటీ ఉందన్నారు. పైగా, జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు మాత్రం ఆయన వెంటే ఉన్నారన్నారు. 
 
ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కరేనని కోట్లాది మంది నమ్ముతున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఏదో ఆశించి ఆయన సహాయం చేయరు. తన వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుతుందనే నిత్యం ఆలోచిస్తారు అని తెలిపారు. ఓదార్పు యాత్ర సమయంలోనూ, కరోనా కష్టకాలంలోనూ జగన్ ప్రజలకు అండగా నిలిచిన తీరును సజ్జల గుర్తుచేశారు. 
 
తమ పార్టీ అధినేత జగన ఏ నాడూ పబ్లిసిటీ కోరుకోలేదన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి  కాలనీలు సృష్టించారని, 17 వైద్య కాలేజీలు, పోర్టులు, హార్బర్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా ప్రచారం చేసుకోలేదని అన్నారు. పైగా, సీఎం చంద్రబాబు నాయుడు 18 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు అప్పుచేశారని కానీ, ప్రజలకు చేసిదేమీ లేదని సజ్జల ఆరోపించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Chandrababu: పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు