1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Schools start on September 5th in AP

ఏపీలో సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం

Schools
కరోనా భయంతో తమ బిడ్డలను పాఠశాలలకు పంపేందుకు తల్లి తండ్రులు వెనకడుగు వేస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం పాఠశాలల నిర్వహణకు ముందడుగే వేస్తోంది.

ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని, సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. నాడు-నేడు పనులపై రెండ్రోజులకు ఒకసారి కలెక్టర్ సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోను అలక్ష్యం ప్రదర్శించరాదని పేర్కొన్నారు. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్‍కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత చెప్పిన ఆ 15 మంది అనుమానితులు ఎవరు?