శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:27 IST)

ఏపీలో ధాన్యం కొనుగోలుకు చకచకా ఏర్పాట్లు

దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులకు మద్దతు ధర కల్పించి రబీలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని జిల్లా స్ధాయి అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. 

లాక్‌డౌన్‌ నేపధ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఇప్పటికే పౌరసరఫరాల సంస్ధ అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1280 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.

తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోతల సమయాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.  75 రోజుల వరకూ ఈ కేంద్రాలు తెరిచే ఉంటాయి. చిత్తూరు జిల్లాలో 16, నెల్లూరులో 179, పశ్చిమగోదావరి జిల్లాలో 65 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
 
* సాధారణ రకం ధాన్యం క్వింటాలుకు రూ. 1,815, గ్రేడ్‌ ఏ రకానికి రూ. 1,835గా ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది
* ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని ధర కంటే బయట మార్కెట్‌లో ఎక్కువ ధర ఉంటే రైతులు ఎక్కడైనా ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు
* స్వయం సహాయక, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల ఆధ్వర్యంలో 
ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు
* రబీ సీజన్‌లో దాదాపు 32 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలుకు సిద్ధమైన పౌరసరఫరాల శాఖ
* ఖరీఫ్‌లో 48.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
* ప్రజాపంపిణీ వ్యవస్ధ, ఇతర సంక్షేమ పధకాల కోసం బియ్యం సరఫరా చేసేందుకు ఖరీఫ్‌ సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా 48.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది
* ఇప్పటివరకు రూ. 8,754 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు
* ఇందులో రూ.8,644 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా మిగిలిన రూ. 110 కోట్లు త్వరలో రైతుల బ్యాంకు అకౌంట్లకు జమకానుంది.