1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TTD Devotees narrowly escaped from road accident

శ్రీవారి ఆదాయం రూ.5 కోట్ల ఆదాయం.. తప్పిన ముప్పు

fire accident
కలియుగ వైకుంఠదైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 31 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు నిండిపోయివున్నాయి. వీరికి పది గంటలపాటు దర్శన సమయం పడుతుందని తితిదే వర్గాలు వెల్లడించాయి. 
 
మంగళవారం తిరుమల శ్రీవారిని 74212 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే, హుండీ ఆదాయం రూ.5.05 కోట్ల మేరకు వచ్చింది. మరోవైపు, తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి. 
 
తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద శ్రీవారి భక్తులకు పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఓ కారుకు ఆకస్మికంగా మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు శ్రీవారి భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల నుంచి వేలూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
సుశాంత్ ప్రియురాలు రియాపై అభియోగాలు.. అంతా ఆమె వల్లే జరిగింది