శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (18:15 IST)

ప్రధాని మోడీ హెలికాప్టర్‌కి ఎదురుగా నల్ల బెలూన్లు, తప్పించుకున్న ప్రధాని

Modi
దేశ ప్రధానమంత్రి ఎక్కడైనా పర్యటిస్తుంటే అక్కడ పూర్తిస్థాయి భద్రత వుంటుంది. ఆయన ప్రయాణించే గగనతలం పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటాయి భద్రతాదళాలు. నో ఫ్లై జోన్ గా ప్రకటించి విమానాలతో పాటు ప్యారాచూట్లు తదితరాలు గాలిలో ఎగురవేయకూడదని కఠిన ఆంక్షలు విధిస్తారు. ఐతే గన్నవరం నుంచి భీమవరం వెళ్లేటపుడు ప్రధాని మోదీ హెలికాప్టర్ కి ప్రమాదం తప్పింది.

 
వివరాలు చూస్తే... అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోడీ భీమవరానికి వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి ఆయన భీమవరానికి హెలికాఫ్టర్‌లో వెళ్తున్న సమయంలో ఆయన హెలికాప్టర్‌కి ఎదురుగా నల్ల బెలూన్లను వదిలారు. దీనితో ఆ బెలూన్లు హెలికాప్టర్‌ సమీపానికి వెళ్లాయి.
 
ఈ ఘటన కృష్ణా జిల్లాలోని కేసరిపల్లిలో చోటుచేసుకోగా దీనివెనుక కాంగ్రెస్‌ శ్రేణులు వున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇది భద్రతా నిఘా వైఫల్యమన్న విమర్శలు వస్తున్నాయి.