సంబంధిత వార్తలు
- తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటలు.. లడ్డూల కొరత?
- స్వరాల బాటలో నడుస్తూ, సంస్కారపు బాటలో ముందుకు సాగిన ధన్యజీవి శ్రీ బాలు: ఉపరాష్ట్రపతి
- శ్రీవారి భక్తులకు శుభవార్త - 12 నుంచి జ్యేష్టాభిషేకం టిక్కెట్లు
- నేడు ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలు రిలీజ్
- గంటన్నర వ్యవధిలోనే శ్రీవారి భక్తులకు సర్వదర్శనం : ఈవో ధర్మారెడ్డి
శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్ల విక్రయం
తిరుమల శ్రీవారి భక్తులకు తితిదే పాలక మండలి శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజుకు 750 టిక్కెట్ల చొప్పున ఆన్లైన్లో విక్రయిస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. ఈ టోకెన్లను కావాలనుకునేవారు https//tirupathibalaji.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
మరోవైపు, పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారికి గరుడసేవ చేయాల్సివుంది. కానీ, ఈ సేవను రద్దు చేశారు. ఈ సేవను ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, ప్రస్తుతం స్వామివారి వార్షిక జ్యేష్ఠాభిషేకం ముగింపు వేడుకలు జరుగుతున్నందున ఈ గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
