గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (11:46 IST)

గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవం

చిత్తూరు జిల్లాలో ఓ గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పీలేరు రూరల్ సీఐ మురళి కృష్ణ తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 
 
కె.వి పల్లి మండలం గ్యారంపల్లె కస్పా సమీపంలోని పీలేరు రాయచోటి జాతీయ రహదారిలోగల వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తు తెలియని మహిళ శవాన్ని గోనెసంచిలో తెచ్చి పడవేసినట్లు స్థానికులు ఫిర్యాదు మేరకు కనుగొన్నామన్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పీలేరు రూరల్ సీఐ మహిళ శవాన్ని పరిశీలించగా ఆమె ఆకుపచ్చని చీర ఎర్రని జాకెట్ ధరించి ఉంది. 
 
అలాగే ఆమె మెడలో రోల్డ్ గోల్డ్ చైనుపై ఏవైఏ అనే అక్షరాలను గుర్తించారు. గుర్తుతెలియని మహిళను హతమార్చి ఇక్కడ తెచ్చి పడవేశారన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. పై ఆచూకీ గల మహిళ ఎవరైనా గుర్తించినట్లయితే పీలేరు రూరల్ సిఐకు సమాచారం అందించగలరని సూచించారు. మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.