మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (19:16 IST)

బోండా ఉమా... నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు... చెప్పుదెబ్బలు తింటావు..!

vasireddy padma
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ టీడీపీ నేత బోండా ఉమ ధ్వజమెత్తారు. "బోండా ఉమా... నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు... నీకు ముందుంది మొసళ్ల పండగ. కాలకేయుడిలాంటి నీకు మహిళలే బుద్ధి చెబుతారు. మహిళల పట్ల మరోమారు అమర్యాదగా మాట్లాడితే చెప్పుదెబ్బలు తింటావు" అంటూ హెచ్చరించారు. తమకేమీ పబ్లిసిటీ పిచ్చి లేదని పద్మ అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బోండా ఉమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 
 
"నువ్వు ఒరేయ్ అంటే మేం ఒసేయ్ అనలేమా... అత్యాచారం జరిగిన మూడ్రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని పరామర్శకు వచ్చారు, అన్నీ అబద్ధాలే చెప్పారు" అంటూ వాసిరెడ్డి పద్మపై బోండా ఉమ విమర్శించారు. దీనిపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. 
 
కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు అని, ఇప్పుడు బోండా ఉమ కారణంగా చంద్రబాబుకు చెడ్డపేరు వచ్చిందని టీడీపీ వాళ్లే బోండా ఉమను తిడుతున్నారని ఎద్దేవా చేశారు. 
 
తనను మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి నుంచి దించేవరకు పోరాడాలని బోండా ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపించాడని, బోండా ఉమ తన పేరును సార్థకం చేసుకుంటున్నాడని, టీడీపీ ఉత్తమ నారి బోండా ఉమ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
 
బోండా ఉమను ఇప్పటివరకు ఓ ఆకు రౌడీ అనుకున్నానని, తాజా పరిణామాలతో మరీ చిల్లర రౌడీ అని అర్థమైందని వ్యంగ్యం ప్రదర్శించారు.