మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2017 (16:14 IST)

బాదంపప్పు, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే?

మొటిమలు తగ్గాలంటే నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పీచు సమృద్ధిగా వుంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది

మొటిమలు తగ్గాలంటే నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పీచు సమృద్ధిగా వుంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. దాంతో ముఖం కళకళలాడిపోతుంది.

శిరోజాలకు బాదం నూనె రాయడం వల్ల మెరుస్తూ అందంగా కనిపిస్తాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సమృద్ధిగా వున్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
మూడు టేబుల్ టీ స్పూన్ల పెరుగులో కొన్ని ఆక్రోట్లు వేసి మెత్తగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖంపై సబ్బులా రుద్దుకోవాలి. ఆక్రోట్ల నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మంపై ముడతలు రానీయకుండా నివారిస్తుంది. జీడిపప్పులు మితంగా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. రోజుకు కొన్ని తినడం ద్వారా బరువు తగ్గవచ్చు.
 
పాలిపోయిన చర్మాన్ని జీడిపప్పు మెరిసేలా చేస్తుంది. కాలి పగుళ్లను కూడా దూరం చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్-ఇ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హై బీపీలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే, మైగ్రెయిన్ నొప్పితో బాధపడే వారికి జీడిపప్పు ఉపశమనం కలిగిస్తుంది.