1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 ఆగస్టు 2016 (12:51 IST)

పాదాలు మృదువుగా మారాలంటే..? అరటిపండు గుజ్జును రాయండి.

అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్లపై రాసి పదినిమిషాలు ఉంచి, తర్వాత నీటితో శుభ్రపర్చుకుంటే మడమలు మెత్తబడతాయి. పాదాలు కోమలంగా, అందంగా ఉండాలంటే వీటన్నింటితో పాటు పోషకాహారం తప్పనిసరి. క్యాల్షియం, ఐరన్‌, జ

అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్లపై రాసి పదినిమిషాలు ఉంచి, తర్వాత నీటితో శుభ్రపర్చుకుంటే మడమలు మెత్తబడతాయి. పాదాలు కోమలంగా, అందంగా ఉండాలంటే వీటన్నింటితో పాటు పోషకాహారం తప్పనిసరి. క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవడం మంచిది.
 
గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి అందులో పాదాలను ఉంచాలి. పది నిమిషాల తరువా మామూలు నీటితో శుభ్రపరుచుకుంటే పగుళ్ల వల్ల ఉండే నొప్పి తగ్గుతుంది. ప్రతిరోజూ సాయంత్రం రోజ్‌వాటర్‌ను కాళ్ల పగుళ్లపై రాసి మౄఎదువుగా మర్దనా చేసినా ఫలితం ఉంటుంది.
 
నిమ్మరసం, వ్యాజ్‌లైన్‌ వేసిన గోరువెచ్చని సబ్బు ద్రావణంలో పాదాలను పెట్టి.. తర్వాత పొడి వస్త్రంతో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ రాయాలి. ఉదయం ఆవనూనెతో కాళ్లను మర్దనా చేసుకుంటే పగుళ్లు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి.