సంబంధిత వార్తలు
- ఆమెతో నీకు వున్న సంబంధమేంటి?: ప్రశ్నించిన భార్యను గుడికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త
- పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికపై అత్యాచారం.. ఎక్కడ?
- యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ
- కేతన్ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!
- ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం వంటి పనులన్నీ చేయించారు.. యువకుడు బలవ్మరణం
ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..
ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, తన భర్తను దారుణంగా హతమార్చింది. ఆపై ఏమీ తెలియనట్టు గుండెపోటుతో చనిపోయాడంటూ డ్రామా ఆడింది. కానీ మెడపై ఉన్న గాయాలు ఆమె పాపాన్ని పట్టిచ్చాయి. ఈ షాకింగ్ ఘటన ఎడపల్లి మండలంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన ఓనె మహిపాల్ (29)కు స్వరూపతో వివాహమైంది. అయితే, స్వరూప వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ ప్రేమకు భర్త అడ్డు వస్తున్నాడని భావించిన స్వరూప, ప్రియుడితో కలిసి మహిపాల్ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.
ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి మహిపాల్కు ఉరివేసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మహిపాల్ గుండెపోటుతో మరణించాడంటూ గ్రామంలో ప్రచారం చేసింది. మహిపాల్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో, అతని మెడపై వింతగా ఉన్న గాయాన్ని గ్రామస్తులు గమనించారు.
గుండెపోటుతో చనిపోతే మెడపై గాయాలు ఎలా వస్తాయనే అనుమానంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
