1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. New GST Rules: This is a list of items that will increase or decrease from January 1, 2022

January 1, 2022 నుంచి జీఎస్టీ బాదుడు.. 5 నుంచి 12 శాతానికి పెంపు

New GST Rules
నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై 2022, జనవరి 1 నుంచి కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో మోయ లేని భారం మోపనుంది. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని మొదట అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 5 శాతం పన్ను మోపింది. దీన్ని జనవరి 1, 2022 నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
 
ఈ పన్నుల పెంపుదల వల్ల అసంఘటిత రంగంలోని చేనేత, జౌళి, పాదరక్షల ఉత్పత్తుల అమ్మకాలకు గడ్డు కాలం రానుంది. దీని ప్రకారం ఇకపై ఆన్‌లైన్, ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. 
 
స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి వాటి ద్వారా పొందే సేవల పైనా, ట్రాన్స్‌పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్‌ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. 
 
కరోనా వల్ల ఇప్పటికే కుదేలైన మోటారు రంగంపై ఈ భారం మోయలేనిది. ఒక పక్క గ్యాస్‌ ధరలు, మరోపక్క జీఎస్టీ పెంపుదలతో హోటల్‌ రంగానికి కూడా ఇకపై గడ్డుకాలమే. కరోనా వల్ల కుదేలైన పర్యాటక రంగానికి జీఎస్టీని పెంచడం చేదు వార్తే.
 
జీఎస్టీ కమిషన్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఇకనుంచీ పన్నుల రీఫండ్‌ మార్పుల కోసం ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. 
తర్వాతి కథనం
పుస్త‌క మ‌హోత్స‌వంపై మ‌క్కువ ... గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ కొత్త సంప్ర‌దాయం!