1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Airtel Prices Increased from Today

నవంబర్ 26 నుంచి ఎయిర్‌టెల్.. బాదుడే బాదుడు

Airtel
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్ ఛార్జీల టారిఫ్‌ను పెంచాయి. ప్రవేశ టారిఫ్‌ వాయిస్‌ ప్లాన్‌లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్‌ కాల్స్‌ ప్లాన్లపై 25 శాతం వరకు పెంచనున్నట్లు పేర్కొంది. 
 
పెరిగిన ఛార్జీలు నవంబర్ 26 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ పెంపు వల్ల ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.200-300కు చేర్చాలని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది.  
 
ఏఆర్‌పీయూ ఆదాయం పెరగడం వల్ల నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రం కొనుగోళ్లలో గణనీయ పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
అలాగే భారత్‌లో 5జీ అమలుకు కూడా ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ పెంపుతో ఇప్పటి వరకు రూ.79తో వచ్చిన 28 రోజుల కాలపరిమితిగల ప్రామాణిక వాయిస్‌ ప్లాన్‌కు ఇకపై రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.
About Writer
సెల్వి