1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Covid Positive Cases increased in Andhra Pradesh

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు... అధికారుల్లో ఆందోళన

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా మరో 186 మందికి ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో కరోనా వైరస్ సోకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
 
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్‌లోనూ ఈ కేసులో నమోదయ్యాయి. దీంతో అన్ని విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. విదేశాల వచ్చే వారిపై కఠిన ఆంక్షలు విధించారు.
 
ఈ నేపథ్యంల ఏపీలో పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 186 మందికి వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 32,036 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన 138 కేసులు నమోదు కాగా కొత్తగా 186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఉగ్రవాదులుగా భావించి భద్రతా బలగాల కాల్పులు - 14 మంది పౌరులు మృతి