గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జులై 2020 (15:51 IST)

ప్రసార భారతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఢిల్లీలో ఖాళీల భర్తీ

ప్రసార భారతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. సోషల్ మీడియా కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం ఏడు ఖాళీలున్నాయి. 
 
న్యూఢిల్లీలో ఈ ఖాళీలను భర్తీచేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 20 చివరి తేదీ. దరఖాస్తుల్ని పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్ తెలుసుకునే వీలుంది. 
 
మొత్తం కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 7
వేతనం- రూ.20,000
విద్యార్హత- పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం. 
జర్నలిజంలో ఏడాది అనుభవం తప్పనిసరి. 
హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సామర్థ్యం ఉండాలి.
వయస్సు- 30 ఏళ్లు
 
దరఖాస్తులు పంపాల్సిన చిరుమానా:
డిప్యూటీ డైరక్టర్ (హెచ్ఆర్) 
దూరదర్శన్ న్యూస్ 
రూమ్ నెం.413,
దూరదర్శన్ భవన్, 
టవర్-బి, కాపర్ నికస్  మర్గ్, 
న్యూఢిల్లీ -110001.