1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. NEET, JEE Main Exam 2020 LIVE Updates: Exams postponed till September

జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలు వాయిదా.. సెప్టెంబర్‌లో మొదలు

NEET
జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలను వాయిదా పడ్డాయి. ఇంతా కొత్త తేదీలను కూడా కేంద్ర మానవ వనరుల మంత్రి ఫోక్రియాల్ ప్రకటించారు. సెప్టెంబర్ 1-6 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించనుండగా, సెప్టెంబరు 27న జేఈఈ అడ్వాన్స్, సెప్టెంబరు 13న నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోక్రియాల్ తెలిపారు. జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ రావడంతో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పరిశీలించడం జరిగిందన్నారు. 
 
ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ వినీత్ జోషీతో కూడిన నిపుణుల కమిటీ ఆధారంగా సెప్టెంబర్‌కు జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు.
తర్వాతి కథనం
కరోనావైరస్‌తో మరణించిన వైద్యుడి కుటుంబానికి రూ. కోటి చెక్కు అందించిన కేజ్రీవాల్