సంబంధిత వార్తలు
- సంగారెడ్డిలో 420 కేజీల గంజాయి పట్టివేత
- ఏపీ- తెలంగాణా రాష్ట్రాలలో ఏడవ ఎడిషన్ గిఫ్ట్ వార్మ్ ప్రచారం ప్రారంభించిన రెన్యూ పవర్
- పింఛనుదారులకు శుభవార్త చెప్పిన టీసీఎం కేసీఆర్ - ఖాతాలో రూ.3 లక్షలు
- వచ్చే యేడాదికి తెలంగాణ సర్కారు ప్రకటించిన సెలవులు ఇవే...
- నేడు - రేపు భారీ వర్షాలు - చిత్తూరు జిల్లాల్లో స్కూల్స్ సెలవు
గురుకులాల్లో కలకలం రేపుతున్న కరోనా - 42 మందికి పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా, విద్యార్థుల వసతి గృహాల్లో ఈ వైరస్ విజృంభిస్తుంది. తాజాగా మరో 42 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది.
సంగారెడ్డి జిల్లా ముత్తంగి మహాత్మా జ్యోతిరావు పూలే ఇంటర్ కాలేజీకి చెందిన అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. మొత్తం 42 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుడు కూడా ఈ వైరస్ బారినపడ్డారు.
ఈ కాలేజీలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 261 మంది విద్యార్థులకు 27 మంది సిబ్బందికి ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో 42 మంది విద్యార్థులకు, ఓ టీచర్కు పాజిటివ్ అని వచ్చింది. దీంతో మిగిలిన విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన విద్యార్థులందరినీ హౌం ఐసోలేషన్లో ఉంచారు. వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు.
తర్వాతి కథనం
