బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి

కరోనాపై ఎన్నో పరిశోధనలు చేస్తుంది.. వ్యూహాన్ ల్యాబ్‌కు నోబెల్ ఇవ్వాలట..!

కోవిడ్ మహమ్మారి చైనా నుంచి పుట్టిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను చెరిపేందుకు డ్రాగన్ కంట్రీ కసరత్తు చేస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా వుహాన్‌ ల్యాబ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 
 
డ్రాగన్‌ దేశం వుహాన్‌ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించి.. ప్రపంచం మీదకు వదిలిందిని పలు దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఓ వింత ప్రతిపాదనను తెర మీదకు తీసుకు వచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించి వుహాన్‌ ల్యాబ్‌ ఎన్నో పరిశోధనలు చేస్తుందని.. దీన్ని పరిగణలోకి తీసుకుని.. వుహాన్‌ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.
 
ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి జౌ లిజియాన్‌ మాట్లాడుతూ.. ''కరోనా వైరస్‌ అధ్యయనంలో వుహాన్‌ ల్యాబ్‌ కృషిని గుర్తిస్తూ మెడిసిన్‌ విభాగంలో నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలి'' అని డిమాండ్‌ చేశారు. 
 
ఇప్పటికే చైనా ప్రభుత్వం వుహాన్‌ ల్యాబ్‌కి ఆ దేశ అత్యుత్తమ సైన్స్‌ అవార్డును ప్రధానం చేసింది. కరోనా వైరస్‌ జీనోమ్‌ని గుర్తించడంలో వుహాన్‌ ల్యాబ్‌ చేసిన కృషికి గాను చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ దానికి అవుట్‌స్టాండింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అచీవ్‌మెంట్‌ ప్రైజ్‌ 2021ని ప్రకటించింది.