1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (11:04 IST)

కొత్తగా మరో 30 వేల పాజిటివ్ కేసులు

దేశంలో మరో 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 30948 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,24,234కు చేరింది. 
 
అలాగే క‌రోనా నుంచి 38,487 మంది కోలుకున్నారు. మరో 403 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,34,367కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,16,36,469 మంది కోలుకున్నారు.    
 
3,53,398 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 52,23,612  వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 58,14,89,377 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.