1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (14:48 IST)

తాలిబన్లలో మార్పు రాలేదా? 150మంది భారతీయులు కిడ్నాప్?

తాలిబన్లలో మార్పు వచ్చినట్లు కనబడట్లేదని ప్రపంచ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాలిబన్లు కిడ్నాప్‌కు పాల్పడటం పెద్ద విషయమేమీ కాదు. కానీ తాలిబన్లలో పరిపాలనకు తర్వాత కూడా అదే తంతును కొనసాగిస్తుండటం ప్రస్తుతం ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది. 
 
ఆఫ్గానిస్తాన్‌లో పని చేస్తున్న ఆరుగురు భారతీయులు 150 మంది కిడ్నాప్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా... ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు భారతీయుల్ని కిడ్నాప్ చేశారనీ వేర్వేరు దేశాలకు చెందిన వారిని బంధించగావారిలో భారతీయులు కూడా ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. భాగ్లాన్ ప్రావిన్స్‌లో ఓ విద్యుత్తు ప్లాంట్‌ వద్ద పని చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
 
ఈ ఇంజనీర్లు ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వద్దకు మినీ బస్సులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో బెదిరించి వీరిని అపహరించారని భాగ్లాన్ పోలీసు అధికార ప్రతినిధి జబిహుల్లా షుజా తెలిపారు. అప్గానిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
ఈ ఇంజినీర్లంతా డ అఫ్గానిస్తాన్ బ్రెష్ణా షెర్కాట్‌లో పని చేస్తున్నారని వివరించారు. ఈ విద్యుత్తు ప్లాంట్, ఇతర భారీ నిర్మాణాల వద్ద 150 మంది భారతీయులు పని చేస్తున్నారని రాయబార కార్యాలయ అధికారి మరొకరు చెప్పారు.