1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Corona epidemic in new form, scientists warn

కొత్త రూపంలో కరోనా మహమ్మారి, హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

Corona epidemic
కరోనా వైరస్ పరివర్తన చెందుతున్నట్లు ఇప్పపటికే గుర్తించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో హెచ్చరిక చేశారు. ప్రస్తుతం వైరస్‌లో కొత్త మార్పులు కనబడుతున్నాయని, ఈ మార్పు తర్వాత వైరస్ వ్యాపిస్తే ప్రస్తుతం అభివృద్ది చేస్తున్న టీకాలు ఎందుకు పనికిరాకుండా పోతాయని పెచ్చరిస్తున్నారు.
 
డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపించినట్లు స్టేటన్స్ సీరమ్ ఇనిస్టిస్ట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తల హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం వందలకొద్దీ మింక్ ఫారాలు ఉన్న జాట్ లాండ్లో ఆంక్షలు విధించింది. అలాగే ఉత్తర డెన్మార్క్‌లో నేటి నుంచి కోవిడ్ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రధాని మెట్టి ప్రెడెక్సన్ తెలిపారు.
 
ఇదిలా ఉండగా జాట్ లాండ్ ప్రాంతంలో దాదాపు 1,100 పెంపుడు కేంద్రాల్లో 1.7 కోట్ల మింక్‌లు పెంచుతున్నారు. 207 కేంద్రాలలో కొత్త రకం కరోనా వైరస్‌ను కనుగొన్నారు. వీటి వల్ల మొత్తం మింక్‌లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు మింక్ కేంద్రాలలో 12 మంది ఈ కొత్తరకం కరోనా వైరస్ బారిన పడ్డారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 214 మందికి ఈ వైరస్ సోకింది.
About Writer
వి
తర్వాతి కథనం
జగన్ దీపావళి కానుక, రూ. 143 కోట్ల “కాపునేస్తం” నిధులు విడుదల