1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Corona patient delivered in 108 ambulance at kurnool

కరోనా వైరస్ సోకిన గర్భిణీకి పురుడు పోసిన ఆంబులెన్స్ సిబ్బంది

corona patient
కరోనా వైరస్ సోకిన ఓ గర్భిణీకి 108 ఆంబులెన్స్ సిబ్బంది పురుడు పోసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శుక్రవారం జరిగింది. పట్టణంలో న్యూ అర్బన్ కాలనీకి చెందిన అనూష.. నిండు గర్భిణీగా ఉన్నప్పుడు కరోనా వైరస్ సోకింది. 
 
శుక్రవారం అనూషకు నొప్పులు రాగా బంధువులు వైద్యులను సంప్రదిస్తే.. హైదరాబాద్ తరలించమన్నారు. ఈ మేరకు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా సిబ్బంది చేరుకుని ఆమెకు వాహనంలో పురుడు పోయగా మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
అంబులెన్స్ టెక్నీషియన్ స్వాతి ఆమెకు ప్రాథమికంగా చికిత్స అందించి.. అనంతరం వేములవాడ ఆరోగ్య కేంద్రానికి తరలించగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తొలిసారి అయినా.. కాన్పును సక్రమంగా నిర్వహించిన 108 టెక్నీషియన్ స్వాతి, పైలెట్ బాలకృష్ణను స్థానికులు అభినందించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బ్యాంకు రుణగ్రహీతలకు గుడ్ న్యూస్.. రూ.2కోట్ల వరకు మారటోరియం వడ్డీ మాఫీ