సంబంధిత వార్తలు
- కోవిడ్ను ఓడించిన ట్రంప్... వైద్య చికిత్స పూర్తయిందట... వైద్యుల ప్రకటన
- కరోనా వైరస్ సోకడం దేవుడి దయ - చైనాకు భారీ మూల్యం తప్పదు : డోనాల్డ్ ట్రంప్-video
- కరోనాకు ఉచిత టెస్టులు చేయిలేం : చేతులెత్తేసిన మేఘాలయ
- దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ఫలితమివ్వని నియంత్రణ చర్యలు!
- తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో బొమ్మ పడదు.. స్కూల్స్ తెరుచుకోవు...
ఏపీలో అన్లాక్ 5.0 గైడ్ లైన్స్ విడుదల: మార్గదర్శకాలు ఇవే
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. దేశంలో రోజుకు 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే జీవన విధానం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అక్టోబరు 15 నుంచి అమల్లోనికి రానున్న అన్ లాక్ 5 మార్గదర్శకాలను పది రోజుల క్రిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ను విడుదల చేసింది.గైడ్ లైన్స్ ప్రకారం రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు,భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.
కోవిడ్ నిబంధనలు కచ్చితంగా ప్రజా రవాణాలో పాటించాలని తెలిపింది. అలాగే గుళ్లు, చర్చీలు, మసీదులలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజర్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశాయి. విద్యాసంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట్ల కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
