1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (21:53 IST)

కరోనా విజృంభణ : ఏపీలో 12,338 - తెలంగాణాలో 4,207 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో 4207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 120215 మందికి జరిపిన పరీక్షల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబ్ మున్సిపాలిటీ పరిధిలో ఏకంగా 1645 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 380 కేసులు, రంగారెడ్డి జిల్లా 336 కేసులు, హనుమకొండ జిల్లాలో 145, సంగారెడ్డి జిల్లాలో 107 చొప్పున నమోదయ్యాయి. 
 
ఇకపోతే, ఈ వైరస్ బారినపడిన బాధితుల్లో గురువారం ఒక్క రోజే 1825 మంది కోలుకున్నారు. అయితే, ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26633 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఏపీలో 12338 పాజిటివ్ కేసులు 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి తగ్గకపోగా రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 12,615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు ఒక్క విశాఖ జిల్లాలోనే చనిపోయారు.  
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12338 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే 2,338 కరోనా కేసులు వెలుగుచూశాయి.  అత్యల్పంగా 216 కేసులు వెస్ట్ గోదావరి జిల్లాలో నమోదయ్యాయి. 
 
అలాగే, ఈ కరోనా వైరస్ కారణంగా ఐదుగురు మృతి చెందగా మరో 3,674 మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,40,056కు చేరింది. అలాగే, 20,71,658 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 14,528 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులు ఉండగా, వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.