1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (13:35 IST)

దేశంలో కరోనా వ్యాప్తి.. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు..

corona Virus
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా వరుసగా నాలుగో రోజు మూడు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. 
 
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64,740 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,038 కొత్త కేసులు బయటపడ్డాయి. 
 
గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్‌, కేరళలో ఇద్దరు చొప్పున, జమ్మూ కశ్మీర్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. 
 
అలాగే ఏపీలో కొత్త ఏడు కేసులు నమోదవగా, మొత్తం 104 కేసులు నమోదైనాయి. తెలంగాణలోనూ 20 కేసులు తాజాగా నమోదు కాగా, మొత్తం కేసులు 143కి చేరింది.