1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (13:40 IST)

యముడికి లేఖ రాసిన తమిళ పోలీసులు.. అలాంటి మరణమే కావాలని..?

చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. కరోనా కారణంగా గత కొద్ది రోజులుగా 60వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారిపై పోరులో ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వారిలో డాక్టర్లు, పోలీసులు ముందు ఉన్నారు.
 
విధి నిర్వహణలో పోలీసులు కరోనాకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. తమను జీవితకాలాన్ని కాపాడాలని ఏకంగా యముడికి లేఖ రాసారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
'మేము ఎన్ని కష్టాలు అనుభవించినా.. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా అంతిమ లక్ష్యం. కాబట్టి మా జీవిత కాలాన్ని దయాగుణంతో పొడిగించాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఈ దేశానికి ఉపయోగపడే మరణం మాకు ఉందని భరోసా ఇవ్వండి. అలాంటి మరణమే మాకు కావాలి. ఈ లేఖ తరువాత పోలీసుల మరణాలపై దయ చూపిస్తారని నమ్ముతున్నాం. ' అని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.