గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జులై 2020 (14:01 IST)

కరోనా వ్యాక్సిన్ రెడీ.. శుభవార్త చెప్పిన అమెరికా శాస్త్రవేత్తలు

కరోనా వ్యాక్సిన్ విషయంలో అమెరికా నుంచి మరో శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వాక్సిన్‌తో ఊహించిన విధంగానే మంచి ఫలితాలు వస్తున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తొలిదశ ప్రయోగాలు పూరైనాయని.. ఫైనల్ టెస్టింగ్ దశకు చేరుకుందని తెలిపారు.

జులై 27 నుంచి ఫైనల్ టెస్టింగ్ ప్రక్రియ మొదలు పెడతామని అమరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ దశంలో 30వేల మందిపై ప్రయోగాలు చేస్తామని తెలిపారు. 
 
ఈ వాక్సీన్‌ను అమెరికా దిగ్గజ ఔషధ సంస్థ మోడర్నా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కరోనా వాక్సీన్ తీసుకున్న తొలి 45 మందిలో మంచి ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాక్సీన్ ఇచ్చిన తర్వాత కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారయ్యాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవని గుర్తించినట్లు వివరించారు. 
 
కొందరిలో మాత్రం ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఐతే వాంతులు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లేవు. ఈ వ్యాక్సిన్ నెలలో రెండు డోస్‌లు ఇవ్వాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఫైనల్ టెస్టింగ్ పూర్తైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.