1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (09:52 IST)

నేడు మూడో వన్డే మ్యాచ్ : క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో భారత్ విజయకేతనం ఎగురవేసిన విషయంతెల్సిందే. శుక్రవారం జరిగే చివరి వన్డేలోనూ గెలుపొంది 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న తలంపులో ఉంది. 
 
ఈ మ్యాచ్ నామమాత్రమే కావడంతో రిజర్వ్ బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం కల్పించి, వారిని పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తుంది. మరోవైపు, కరోనా నుంచి కోలుకున్న స్టార్ ఆటగాడు శిఖర్ ధవాన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు.
 
మరోవైపు, పర్యాటక వెస్టిండీస్ జట్టు బలంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ వైఫల్యాలు ఆ జట్టును ఎంతగానో వేధిస్తున్నాయి. ముఖ్యంగా, బ్యాటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలన్న కసితో కరేబియన్ కుర్రోళ్లు ఉన్నారు.